రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో మంచి జోష్‌ మీదున్నాడు. తన క్రేజ్ రోజురోజుకీ  పెంచుకుంటూ పోతూ అనతికాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇకపోతే పూరిజగన్నాధ్ టెంపర్ సినిమా తర్వాత సరైన హిట్స్ లేక చతికిల పడ్దాడు. కాని ఈ సంవత్సరం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ కొట్టాడు.

 

 

ఇక ఇప్పుడు తాజాగా ఫైటర్ టైటిల్ తో రేపో మాపో విజయ్ దేవరకొండ ఈ సినిమాని పూరి ఛార్మి తో కలిసి పట్టాలెక్కించ బోతున్నాడు. ఇదిలా ఉండగా ఇస్మార్ట్ హిట్ తో పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ తగలడమే కాదు, విజయ్ దేవరకొండ వలన పాన్ ఇండియా మూవీ తీసే ఛాన్స్ కూడా దక్కింది. ఇక బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కతున్న ఫైటర్ సినిమా కోసం ఇప్పటికే ఛార్మి, పూరి జగన్నాధ్ లు అన్ని పనులను ముగించారని టాక్ ఉంది.

 

 

ఇదిలా ఉండగా బాలీవుడ్ కరణ్ జోహార్ హ్యాండ్ కూడా ఫైటర్ కి తోడవడంతో పూరి అండ్ ఛార్మీలు బిందాస్ గా ఫైటర్ పాన్ ఇండియా స్క్రిప్ట్ ని లాక్ చేసారని తెలుస్తుంది.. ఇకపోతే ఫైటర్ చిత్రం కోసం పూరి తో పాటుగా ఛార్మి కూడా ముంబై కె షిఫ్ట్ అవబోతుందట. ఎందుకంటే ఇదంతా కరణ్ జోహర్ ఇచ్చిన సలహా వల్ల జరుగుతున్న యవ్వారం అని అంటున్నారు. ఇలా ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ముంబై వేదికగా పని చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుందని ఈ టీం నమ్మినారట.

 

 

ఇకపోతే బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం ఉంబోతుందని సమాచారం. ఇందుకు గాను కరణ్ జోహార్ టీం తో పాటుగా పూరి కూడా లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నారని… ముంబైలోని జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో ఫైటర్ షూట్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: