సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. చిత్రలహరి తర్వాత సాయి తేజ్ ప్రతిరోజూ పండగేతో మరో హిట్టు కొట్టాడు. ఈ సినిమాలో హీరో కన్నా రావు రమేష్, సత్య రాజ్ పాత్రలకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే ఇలాంటి కథను ఒప్పుకున్నందుకు మెగా హీరోని మెచ్చుకుంటున్నారు.   

 

సినిమా కథ విన్న దగ్గర నుండి అల్లు అరవింద్ కు చాలా డౌట్లు ఉన్నాయట. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది. బూతు లేదు యూత్ కు నచ్చుతుందా అని అడిగాడట. అయితే మారుతి మాత్రం మీకు కథ నచ్చింది కదా అని చేసేద్దాం అన్నాడట. ఇక సినిమా పూర్తయ్యాక సినిమా చూసిన అల్లు అరవింద్ కడుపుబ్బా నవ్వారట అయినా కూడా మనం నవ్వినట్టు ఆడియెన్స్ నవ్వుతారా అని అడిగారట.  

 

అంతేకాదు థియేటర్ లో నవ్వినా సరే బయటకు వచ్చి సినిమా బాగుందని చెబుతాడా అని అన్నాడట. ఇలాంటి అన్ని డౌట్లకు సమాధానం దొరికిందని అన్నారు అల్లు అరవింద్. మొదటి షో నుండి ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు అల్లు అరవింద్. 10 రోజుల్లోనే పాతిక కోట్ల కలక్షన్స్ తో సాయి తేజ్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది ప్రతిరోజూ పండగే.

 

కొన్నాళ్లుగా సక్సెస్ లు లేక వెనుకపడిన సాయి తేజ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు సాయి తేజ్. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: