టాలీవుడ్ లో ఎస్ఎంఎస్ మూవీతో హీరోయిన్ గా పరిచయం అని నటి రెజీనా కసండ్ర.  ఆ తర్వాత మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీస్ తో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్ గా మారింది. అయితే కొంత కాలంగా రెజీనాకు తెలుగు లో ఛాన్సులు రావడంలేదు. ఆ మద్య అడవి శేషు హీరోగా వచ్చిన ‘ఎవరు’ మూవీలో నెగిటీవ్ పాత్రలో కనిపించింది.  ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో తర్వాత సైరా సినిమాలో నటించారు.  దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా అలరించలేక పోయింది.  దాంతో తన తదుపరి సినిమాపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు చిరంజీవి.  ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకు పోతున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.

 

దేవాలయాల పై జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి తీసుకు వచ్చే పాత్రలో మెగాస్టార్ నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.   ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో జనవరి తొలి వారంలో షురూ కానుంది. అయితే  సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ పాటలో స్టార్‌ హీరోయిన్‌ రెజీనా కాసాండ్రా మెరువనున్నట్లు టాక్‌ నడుస్తోంది. నిజమైతే రెజీనా తక్కువ సమయంలోనే మెగాస్టార్‌ చిరు తో కలిసి డ్యాన్స్‌ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసినట్టే అని అందరూ అనుకున్నారు.  కానీ ఇప్పుడు టాలీవుడ్ లో మరో టాక్ నడుస్తుంది.

 

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కోకాపేటలో వేసిన భారీ సెట్‌లో సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తుంది. అయితే రెజీనా ఓ ఐటమ్ సాంగ్ లో నటించబోతుందని.. గతంలో ఖైదీ నెంబర్ 150 లో రాయ్ లక్ష్మి ‘రత్తాలు రత్తాలు’ అనే పాటలో అలరించిన విషయం తెలిసిందే.  మరి రెజీనాకు స్పెషల్ సాంగ్ తో తెలుగులో కలిసి వస్తుందని అనుకున్నారు.  కానీ  డిఫరెంట్ పాత్రలు, నెగటివ్ రోల్స్‌లో నటిస్తోన్న రెజీనా.. స్పెషల్ సాంగ్‌లో నటించడానికి నో చెప్పేసిందని వార్తలు వినపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమో.. అబద్దమో తెలియని పరిస్థితి..  మరి దీనిపై రెజీనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: