సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు సంవత్సరాల నుండి మంచి జోరుమీద ఉన్నాడు. చేసిన రెండు సినిమాలు 2018లో 2019 లో వచ్చిన భరత్ అనే నేను మరియు మహర్షి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేయడం తో నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావడంతో ఫుల్ హ్యాపీ మీద ఉన్నాడు మహేష్. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయం కొట్టడానికి రెడీ అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల మెల్లమెల్లగా మొదలైన సంగతి అందరికీ తెలిసినదే.

 

సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5వ తారీఖున హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం లో భారీ ఎత్తున చేయటానికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూ ఇయర్ వేడుకలు కుటుంబ సమేతంగా కలసి దుబాయిలో ఎంజాయ్ చేశాడు సూపర్ స్టార్ మహేష్. కూతురు సితార తో కలిసి స్టార్ హోటల్ లో డాన్స్ చేస్తూ కొత్త సంవత్సరం కొత్త ఘడియలను మహేష్ గడపడం జరిగింది. అంతేకాకుండా నమ్రతా కుటుంబ సభ్యులతో మరియు ఇంకా కొంతమంది బంధువులతో దుబాయ్ లో ఉన్న స్టార్ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ వాటి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్ట్ చేయటం జరిగింది.

 

ఇదే తరుణంలో దుబాయ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేస్తూ నూతన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీంతో మహేష్ అభిమానులు తమ అభిమాన నటుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ పెడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ సంక్రాంతికి కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ మహేష్ న్యూ ఇయర్ ఫోటో లు కింద కామెంట్ చేస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: