టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.. అప్పట్లో ఎన్నికల సమయంలో ఆయన తరుపు సభ్యులు దారుణంగా ఓటమి పాలయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక చోటునుంచే గెలిచారు. అదే సమయంలో యూపీఏ ప్రభుత్వంలో తన పార్టీనీ విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల ఏపిలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూశారు. దాదాపు రెండేళ్లు మంచి కథ కోసం ప్రయత్నించిన ఆయన తమిళంలో హిట్ అయిన ‘కత్తి’ మూవీ రిమేక్ కి సిద్దమయ్యారు. వివివినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ రాంచరణ్ నిర్మించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు చిరంజీవి పై ఉన్న భ్రమలు అన్నీ తొలగిపోయాయి. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించాడు మెగాస్టార్.
దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నిరాశపరిచింది. కానీ మెగాస్టార్ చిరంజీవి చిరకాల కోరిక ‘సైరా’తో తీరింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీలో నటిస్తున్నారు. తాజాగా నటిస్తున్న 152వ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గత ఏడాది విజయ దశమి రోజు జరిగినప్పటికీ.. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో మూవీ ముందుకు సాగుతుంది.
చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా ఇందులో కనిపించనున్నారు. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. సాదా సీదాగా కొత్త లుక్ తో చిరంజీవి ఆకర్షణీయంగా కన్పిస్తున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొరటాల వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.. అలాంటి దర్శకుడు మెగాస్టార్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.