దేవిశ్రీ ప్రసాద్ పరిస్థితి చూస్తుంటే ఆయన ఫ్యాన్స్ కి ఏమీ అంతు చిక్కడం లేదు. గతంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. హీరో ఎవరైనా వాళ్ళ కి తగ్గట్టుగా ట్యూన్స్ ఇచ్చి మంచి బ్యాగ్డ్రౌండ్ స్కోర్ తో సినిమాని బాగా హైప్ తీసుకు వచ్చేవాడు. కానీ ఎందుకనో ఈ మధ్య కాలంలో దేవి హవా మొత్తంగా తగ్గిపోయింది. సినిమాలన్నిటికి ట్యూన్స్ రిపీటవుతున్నాయన్న కంప్లైంట్ వస్తోంది. దానికి తోడు థమన్ గట్టిగా పోటీ ఇస్తూ వస్తున్నాడు. దాంతో దేవి బాగా వేకబడిపోతున్నాడు. ఇక వాస్తవంగా చూస్తే కూడా దేవీ మ్యూజిక్ నిజంగా అంత మ్యాజిక్ చేయడం లేదు. అందుకు ఉదాహరణ మహేష్ తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అల నుంచి వచ్చిన పాటలన్ని జనాల నీళ్ళలో నానిపోతుంటే సరిలేరు పాటలు ఒక్కటి కూడా గుర్తుండటం లేదు. ఇక ఇదే సమయంలో దేవి గురువుగారు మెలోడి బ్రహ్మ మణిశర్మ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం కూడా దేవికి దెబ్బైపోతోంది.  

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత్మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నాగాని అగ్ర తాంబూలం మాత్రం మణిశర్మ కే అందుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొన్నటి వరకూ అవకాశాలు లేక మ్యూజిక్ ఇవ్వలేక పోయిన మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫుల్ గా ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం మణిశర్మ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా మెగా స్టార్ సినిమా కూడా మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేసాడు ఈ మెలోడి బ్రహ్మ.

 

చిరు-మణిశర్మ కాంబో తర్వాత ఫ్యాన్స్ ఎదురుచూసే మరో కాంబో మహేష్ - మణిశర్మ లదే. అవును వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసినదే. అందుకే లేటెస్ట్ గా తన నెక్ట్స్ సినిమాకు మణిశర్మ ను తీసుకొవాలనే ఆలోచనలో ఉన్నాడట మహేష్. భారత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా దేవి తో వరుస గా సినిమాలు చేస్తున్న మహేష్ దేవి సాంగ్స్ ట్రోల్ అవుతుండటంతో నెక్స్ట్ వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాకు దేవి ప్లేస్ లో మణిశర్మ ను తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తాజా గా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే మహేష్ -మణిశర్మ కాంబోలో మరో అదిరిపోయే ఆల్బమ్ రావడం గ్యారెంటీ అని మహేష్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: