బాలీవుడ్ లో స్టార్ కపుల్ అంటే రణ్ వీర్ సింగ్, దీపిక పదుకుణె అని గత కొంతకాలంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ కపుల్ గురించి ఎప్పుడు ఏదో ఒక  సెన్ సెషనల్  న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ విషయాలతో పాటు వీరిద్దరికి సంబంధించిన సినిమాల వార్తలు మీడియాలో వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఒక విచిత్రమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరగడానికి కారణం కూడా కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. రణ్ వీర్ సింగ్ ఒక అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్ ను దాదాపు 7 లక్షల రూపాయలు అద్దె చెల్లించి మరీ తీసుకున్నాడట. దాన్ని ఆఫీస్ గా వాడుకుంటున్నాడట. 

 

మరి దీనిలో అంత ఆశ్చర్యపోవాల్సిన వింతేముంది అనుకుంటే పొరపాటే. అసలు విషయం ఏంటీ అంటే రణ్ వీర్ సింగ్ 7 లక్షలు అద్దె చెల్లిస్తున్న ప్లాట్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే అది కూడా పక్కనే దీపిక కు ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఖాళీగానే ఉంది. అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ కు ఆమె రెంట్ కు ఇస్తూ ఉంటుందట. దాదాపు పాతిక కోట్ల విలువ చేసే ఆ ప్లాట్ ను రణ్ వీర్ సింగ్ వాడుకోకుండా సొంతంగా నెలకు 7 లక్షల రెంట్ చెల్లిస్తూ మరో ఫ్లాట్ లో ఉండటం ఏంటో అంటూ అంతా ఆరా తీస్తున్నారు.

 

అయితే ఈ ఫ్లాట్ మాత్రమే కాదు దీపిక పదుకునే కు చెందిన ఆస్తులు, మరి ఏ ఇతర వస్తువులు కూడా రణ్ వీర్ సింగ్ వినియోగించుకోడని.. ఆమె సంపాదించింది పూర్తిగా ఆమె ఖాతాలోనే ఉంటాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాదారణంగా భార్య భర్తలు అయితే ఒకరి ఆస్తులు ఒకరికి అవుతాయి. కాని ఈ జంట మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత వేరు వేరుగానే అన్నట్లుగా ఉంటున్నారు. రణ్ వీర్ సింగ్, దీపికలు మాత్రమే కాకుండా కొంతమంది సినీ సెలబ్రెటీ కపుల్స్ ఎక్కువ గా ఇలాగే ఉంటారట. ఒకరి సంపాదన తో ఒకరికి సంబంధం లేనట్లుగానే ఉంటారట. మరి ఎలా దాంపత్య జీవితం అంటారో వాళ్ళకే తెలియాలి. మిడిల్ క్లాస్ జనాలే ఒకరి సంపాదన ఒకరు పంచుకుంటూ ఉంటారు. మరి వీళ్ళకి ఈ వింత జబ్బేమిటో.  

మరింత సమాచారం తెలుసుకోండి: