మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు అవుతుంది.. మరి అప్పుడే హీరోగా తప్పుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. పదేళ్ల గ్యాప్ లో పొలిటికల్ కెరియర్ ఎలా ఉన్నా సినిమాల పరంగా చాలా గ్యాప్ ఏర్పడింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తనని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్న చిరంజీవికి మెగా ఫ్యాన్స్ సర్ ప్రైజ్ హిట్ ఇచ్చారు. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో తేడా ఉండదు అన్నట్టుగా ఖైది నంబర్ 150తో చిరు చితక్కొట్టాడు. 

 

ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో ఏళ్లుగా తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసిం హా రెడ్డి సినిమా చేశాడు చిరంజీవి. ఈ సినిమా అలా రిలీజైందో లేదో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు చిరు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ నిన్న గురువారం మొదలైంది.  

 

సినిమా తర్వాత చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెబుతాడని ఫిల్మ్ నగర్ టాక్. అమితాబ్ బాటలోనే ఇక హీరోగా మానేసి వయసుకి తగిన పాత్రలు చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది. వయసు మీద పడ్డా సరే చిరు అప్పటికి ఇప్పటికి తన గ్రేస్ ఏమాత్రం తగ్గించలేదు. సైరా సెపరేట్ జోనర్ సినిమా కావడంతో అందరికి ఎక్కలేదు.

 

కొరటాల శివ మూవీ మాత్రం మళ్లీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను రాం చరణ్, నిరంజన్ రెడ్డి ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ గురువారం మొదలైంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఇయర్ ఆగష్టు కల్లా సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: