తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ మోహన్ బాబు  కుటుంబాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఎవరి స్థాయిలో వారు రాణించి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. మోహన్ బాబు ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. చిరంజీవి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ జూనియర్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇకపోతే నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. పార్క్ హయత్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మోహన్ బాబు టి.సుబ్బిరామిరెడ్డి కృష్ణంరాజు సహా పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. 

 

 

 ఇదిలా ఉండగా  చిరంజీవి ప్రసంగం అనంతరం మాట్లాడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ చిరంజీవి వ్యాఖ్యలపై  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి.అయితే  రాజశేఖర్ ప్రసంగం అనంతరం మాట్లాడిన మోహన్ బాబు... చిరంజీవికి తనకు ఎప్పుడు చిన్న చిన్న సెటైర్లు వేసుకుంటామని చిరంజీవి ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఒక్కటేనంటూ మోహన్ బాబు  వ్యాఖ్యానించారు. చిరంజీవితో తనకు ఎంతో అనుబంధం ఉందని.. ఏదో చిన్న చిన్న సెటైర్ లు తప్ప అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అంటూ మోహన్ బాబు తెలిపారు. అయితే మోహన్ బాబు ఇలా మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న చిరంజీవి వచ్చి మోహన్ బాబుకు  ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. 

 

 

 

 ప్రస్తుతం సోషల్ మీడియాలో మా డైరీ ఆవిష్కరణలో మోహన్ బాబుకు చిరంజీవికి  పెట్టిన ముద్దు ఫోటో వైరల్ అవుతుంది. మోహన్ బాబు  మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి వెనకనుంచి ప్రేమగా  హత్తుకొని ముద్దు పెట్టారు. అయితే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే ఇద్దరు హీరోలు అంత క్లోజ్ గా ఉండడం పై మెగా అభిమానులు మంచు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఘటనపై మంచు మనోజ్ ఓ ట్విట్  చేశారు. వీరిద్దరే నిజమైన గ్యాంగ్ స్టార్స్ ఎంతో మందికి ఆదర్శం అంటూ మంచు మనోజ్ ఓ ట్విట్  పెట్టారు. అంతేకాకుండా ఈ ఇద్దరు సినీ అమ్మా ముద్దు బిడ్డలు..   2020 సంవత్సరం లో ఇదే బెస్ట్ పిక్  అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: