వరుసగా మూడు భారీ ఫ్లాపులు సినిమా తర్వాత తన కెరీర్లో మర్చిపోలేని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇటీవల కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటించిన రూలర్ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 20వ తారీఖున విడుదలయ్యే మొట్టమొదటి రోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ కావడంతో బాలయ్య మార్కెట్ రోజురోజుకి తగ్గితున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో నందమూరి కుటుంబానికి అతి పెద్ద అభిమానిగా డైరెక్టర్లలో పేరొందిన మాస్ డైరెక్టర్ బోయపాటి ఖచ్చితంగా బాలయ్య తో తీయబోయే మూడో సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని సినిమా స్టోరీ విషయంలో అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో చాలా డిఫరెంట్ గా బాలయ్య బాబు ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలయ్య కోసం బంగారం లాంటి హీరోయిన్ నీ సినిమాలో నటింపజేయడానికి బోయపాటి రెడీ అయినట్లు తాజాగా అందుతున్న సమాచారం. మేటర్ లోకి వెళితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని నటింపజేయడానికి బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. నాగార్జునతో పాటు మన్మదుడు 2 సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించడం జరిగింది ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

 

అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు లేని నేపథ్యంలో బోయపాటి స్వయంగా వచ్చి బాలయ్య పక్కన సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఈ నెల చివరిలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే వేసవిలో సినిమాని విడుదల చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: