తెలుగు లో వస్తున్న కామెడీ కార్యక్రమాల్లో బాగా పాపులర్ అయినవి జబర్ధస్త్, పటాస్.  అయితే జబర్ధస్త్ కామెడీ షోలో అనసూయ యాంకర్ గా పరిచయం అయ్యింది. ఈ అమ్మడి హాట్ డ్రెస్సింగ్, ఆకట్టుకునే వాయిస్ తో అందరి మనసు దోచింది.  అతి తక్కువ కాలంలోనే జబర్ధస్త్ పాపులర్ అయ్యింది.  దాంతో వరుసగా ఇతర ఛానల్స్ లో, వెండితెరపై ఛాన్సులు కొట్టేసింది.  ఈ క్రమంలో కొంత కాలంగా జబర్ధస్త్  కి విరామం ఇచ్చింది.  ఆ సమయంలో నటి రష్మి యాంకర్ గా వచ్చింది.  అనసూయ కన్నా మరింత అందంగా తయారై.. వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.  

 

ఈ అమ్మడు కూడా అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయి వరుసగా హీరోయిన్ ఛాన్సులు కొట్టేసింది.  ప్రస్తుతం ఈ ఇద్దరు హాట్ బ్యూటీలు జబర్థస్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ లో యాంకర్లుగా చేస్తున్నారు.  ఇక పటాస్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యింది యాంకర్ శ్రీముఖి. మెయిల్ యాంకర్ రవితో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  రచ్చ రాములమ్మ అంటూ ఎంత వ్యంగమైన స్కిట్ చేసినా అది కేవలం అలరించేందుకు అని మేనేజ్ చేస్తుంటారు. ఇటీవల మా ఛానల్ లో ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 3’ లో శ్రీముఖి ఎంత హడావుడి చేసిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

మొత్తాని అన్ని టాస్క్ లు పూర్తి చేసుకొని చివరిదాకా పోరాడింది..అయితే చివరికి రాహూల్ సిప్లిగంజ్  తాజాగా  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శ్రీముఖి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది.  ఇందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడదమనే ఆలోచనలో ఉంటున్నారు. ఈ సందర్భంగా తన వంతుగా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసురుతున్నట్లు తెలిపారు. వితిక, జానీ మాస్టర్, యాంకర్ రష్మిలను మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: