ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు దూరమవుతుందో చెప్పడం చాలా కష్టం. అందులో సినిమా రంగంలో ప్రేమ పెళ్లిలు చేసుకుని విడిపోకుండా కాపురం చేసుకుంటున్న జంటలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చూ. ఇప్పటికే టాలీవుడ్‌లో కానివ్వండి బాలీవుడ్‌లో కానివ్వండి. ముందుగా ప్రేమ పేరుతో కొంతకాలం కలిసి ఉండటం. తర్వాత పెళ్లి చేసుకుని, అంతే త్వరగా విడిపోవడం సాధరణమైన విషయంగా మారింది. ఇలాంటి నిర్ణయాలు ఆలోంచించి తీసుకుంటున్నారో లేక అనాలోచితంగా అడుగు ముందుకేస్తున్నారో తెలియడం లేదు.

 

 

ఇకపోతే మనుషుల మద్య ప్రేమలు కూడా తగ్గిపోతున్నాయి. అంత కాలం ఒక వ్యక్తితో కాపురం చేసి కలిసి ఉండి దూరమవడం అంటే నిజంగా మంచిమనుసు ఉన్న మనుషులకు ఇది బాధకరమైన విషయం. ఇక ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా విడాకుల వైపుగా అడుగులేస్తుందని తెలుస్తుంది. ఆమె కేవలం నటి మాత్రమే కాదట యాంకర్ కూడా. ఎన్నో ఏళ్లుగా తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు తన భర్తతో విడిపోవడానికే నిశ్చయించుకుందనే వార్త ఇప్పుడు గుప్పుమంటుంది.

 

 

ఇంతకాలం తెరపై అందర్నీ నవ్విస్తూ ఉండే సదరు యాంకర్ నిజ జీవితం మాత్రం కన్నీటి మయంగానే మారిపోయిందని అనుకుంటున్నారట. ఇకపోతే ఇంతకాలం భర్తతో గొడవలు జరుగుతున్నా కూడా పెద్దవాళ్ల కోసం కలిసున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. తీరా ఇప్పుడు ఆ పెద్దోళ్లు వెళ్లిపోయిన తర్వాత భర్తతో ఉండలేక విడిగా బతికేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా సొంతంగా ఇళ్లు తీసుకుని ఒంటరిగానే ఆమె కాలం గడిపేస్తుందని.. ఒంటరి అనే ఫీల్ రాకుండా ఉండటానికి మరింత పని పెట్టుకుని బిజీ అయిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు.

 

 

ఇకపోతే ఈ మద్యకాలంలో మంచు మనోజ్ కూడా విడాకులు తీసుకున్నాడు. ఈయనే గాక కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా విడాకులు తీసుకుంది. ఇప్పుడు తాజాగా ఈ యాంకరమ్మ కూడా విడాకుల వైపుగా అడుగులేస్తుందని తెలుస్తుంది. ఇంతకు ఆమె పేరు బయటకు రాలేదు కాని త్వరలోనే తెలుస్తుందంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: