టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే, ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో యువరత్న బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత కూడా మరొక్కసారి బాలకృష్ణ సరసన లయన్ సినిమాలో కూడా నటించిన రాధికా ఆప్టే, ఒకింత బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా నటించడానికి సిద్ధం అని ఇటీవల చెప్పడం జరిగింది. అంతేకాక ఒక సినిమాలో కొంత న్యూడ్ గా కూడా నటించిన రాధికా ఇటీవల ఒక పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సౌత్ లోని ఇద్దరు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

 

తనకు సౌత్ సినిమాలన్నా, ఇక్కడి ప్రేక్షకులన్నా ఎంతో అభిమానమని చెప్పుకొచ్చిందట. అయితే సౌత్ లో తాను నటించిన సినిమాల్లో ఇద్దరు హీరోలు తనను కొంత ఇబ్బంది పెట్టినట్లు చెప్పుకొచ్చింది రాధికా. వివరాల్లోకి వెళితే, తాను ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా హీరో తనతో ఒకింత అసభ్యంగా ప్రవర్తించాడని, అయితే సదరు సినిమా నిర్మాతలు కూడా ఆ హీరోగారికే వొంతపాడారని, అది తనను మరింత ఇబ్బందిపెట్టినట్లు చెప్పిన రాధికా, మరొక హీరో సినిమాలో నటించేటప్పుడు ఒకానొక సందర్భంలో భోజనాల వేళలో తనకు ఆకలి వేస్తుంటే యూనిట్ వారిని భోజనం చేద్దామా అని అడుగగా, 

 

ఆగండి, ముందుగా హీరోగారు భోజనం చేసిన తరువాతనే మనం తినాలని అన్నారని, తిండి తినడానికి కూడా ఇటువంటి నియమాలేంటో తనకు అర్ధం కాలేదని, ఆయనొక రసికుడు, ఈయనేమో మాట వినడని తన ఆవేదన చెప్పుకొచ్చిందట. అయితే రాధికా చేసిన ఈ సంచలన ఆరోపణల అనంతరం, ఆ హీరోలు ఎవరు, ఎందుకు అలా ప్రవర్తించారు అనే విషయాలపై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో, అలానే ప్రేక్షకుల్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ వారు ఎవరై ఉంటారో అని అందరూ తెగ తర్జన భర్జన పడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: