టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి.  తీసినవి ఐదు సినిమాలే అయినా అనీల్ రావిపూడి కామెడీ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.   పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్సినిమాలతో మంచి పేరు సంపాదించాడు.బ అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.  ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ప్రేక్షకుల  మనసు దోచే సినిమాలు తీస్తున్న అనీల్ రావిపూడిపై మంచి నమ్మకంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.  

 

ఈ మూవీకి సంబంధించిన టీజర్, లిరిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  అంతే కాదు ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే పదిహేనేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తుంది.  ఇందులో భారతి పాత్రలో ఆమె నటించబోతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  గత ఏడాది సంక్రాంతి కానుకగా  అనీల్ రావిపూడి  ‘ఎఫ్ 2’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  తాజాగా మహేష్ బాబు, రష్మిక మందన జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా రాబోతుంది.   ఈ సంక్రాంతికి మహేశ్ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు'తో మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించనున్న అనిల్ రావిపూడి ఇంట్లో సంక్రాంతి పండగ ముందే వచ్చింది.

 

ఆయన భార్య భావని, ఈ ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇప్పటికే శ్రేయాస్వి అనే కుమార్తె ఉందన్న సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడికి బాబు పుట్టాడన్న వార్తను తెలుసుకున్న మహేశ్ బాబు, అభినందనలు తెలిపారు.  తాజాగా తన సంతోషాన్ని అనీల్ రావిపూడి ట్విట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అనిల్ దంపతులు ఇప్పుడు చాలా గర్వపడుతుంటారని అన్నారు. వారి కుటుంబంపై దేవుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అనిల్ దంపతులను ఆశీర్వదించారు. మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందుగా శుభవార్త తెలిపారు  అనీల్ రావిపూడి. 

మరింత సమాచారం తెలుసుకోండి: