టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత రెండేళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతం అవుతున్నాడు. ముందుగా రెండేళ్ల క్రితం మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా అప్పట్లో ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఓవర్ ఆల్ గా యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా అనంతరం యువ దర్శకుడు వక్కంతం వంశి దర్శకత్వంలో నా పేరు సూర్య అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడంతో ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు బన్నీ. 

 

ఆ సినిమానే ప్రస్తుతం ఆయన నటిస్తున్న అలవైకుంఠపురములో మూవీ. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలే పెట్టుకున్నారు. అయితే కొన్నాళ్ల నుండి మెగా ఫ్యాన్స్ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక జట్టుగా, అలానే కేవలం బన్నీ ఫ్యాన్స్ మరొక జట్టుగా చీలినట్లు సమాచారం. ఇక అప్పట్లో బన్నీ, ఒక ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ అంటూ పలికిన మాట ఎంతో వైరల్ అవ్వడంతో, అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ బన్నీకి లభించలేదు. 

 

అందువల్లనే గతంలో వచ్చిన బన్నీ సినిమాలు ఒకింత సక్సెస్ కాలేదని అనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. మరి ఎంతో కష్టపడి ఎట్టకేలకు హిట్ కోసం ఎదురు చూస్తున్న బన్నీకి ఈసారైన పవన్ ఫ్యాన్స్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో చూడాలి. అయితే మెగాఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు అనేది కొంత పుకారేనని, అటువంటిది ఏమి లేదని మరికొందరు బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో బన్నీకి అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ మాత్రం అవసరం అని, దానికి మెగాఫ్యాన్స్ అందరు సపోర్ట్ అవసరమని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: