రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న సినిమాల సందడి మాములుగా లేదు. ఏకంగా ముగ్గురు బడా స్టార్లతో పాటు మరొక యువ హీరో కూడా బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాడు. ముందుగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా దర్బార్, ఈ సంక్రాంతి రేస్ లో అందరికంటే ముందుగా జనవరి 9న వస్తోంది. తొలిసారిగా రజినీకాంత్ తో మురుగదాస్ సినిమా చేస్తుండడంతో, రజిని ఫ్యాన్స్ లో వీరిద్దరి కాంబో పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఆ తరువాత రెండు రోజుల అనంతరం జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ బాబు, 

 

అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కానుండగా, ఆ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాని తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు బన్నీ, త్రివిక్రమ్ ల కలయికలో తెరకెక్కిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించి ఉండడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక వీటితో పాటు కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న ల తొలి కలయికలో తెరక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా జనవరి 15న వస్తోంది. 

 

మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు ఈ సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో అటు ప్రేక్షకులకు కన్నుల పండుగతో పాటు ముఖ్యంగా బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు జేబులు నిండా డబ్బులే డబ్బులు అని చెప్పాలి. వాస్తవానికి ఈ సీజన్ లో పెద్దగా సక్సెస్ కాని సినిమాలను సైతం, కనీసం ఒక్కసారైనా చూడాలని ప్రేక్షకులు భావిస్తుంటారు. అందరికీ సెలవలు కావడం, అదీకాక చాలామంది ఇళ్లలో చుట్టలతో ఇల్లంతా సందడి నెలకొని ఉండడంతో, అందరూ కలిసి సంతోషంగా సినిమాలకు వెళ్లాలని ఆశిస్తుంటారు. అందుకే ఈ సీజన్ లో సినిమాలకు అంత బాగా కలెక్షన్స్ వస్తాయి.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: