యాంకర్ అండ్ నటి అనసూయ స్పీడ్ ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. బుల్లితెరతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న ఈ హాట్ యాంకర్ మరోవైపు వరుసగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్ - బన్ని కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమాలో అనసూయ కి ఆఫర్ వచ్చిందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక 2020 లో అడుగు పెట్టిన సందర్భంగా అనసూయ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంది అంటే ఆసక్తికరమైన ప్లేస్ అని తెలిసింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అనసూయ అడవులకు వెళ్లిందట. అందరిలా బీచ్ వెకేషన్స్ అంటూ ఏమాత్రం హడావుడి చేయకుండా కుటుంబంతో కలిసి అడవికి వెళ్లడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఆన్ లొకేషన్ నుంచి అనసూయ స్వయంగా ఫోటోలు షేర్ చేసింది. అలాగే వాటితో పాటు ఓ వీడియోని షేర్ చేసి దేవుడా మమ్మల్ని కాపాడు! అంటూ ప్రాధేయపడింది.దేవుడిని అనసూయ ఎందుకు అంతగా ప్రాధేయపడింది .. అని ఆరా తీయగా అనసూయ షేర్ చేసిన ఆ వీడియోలో ప్రకృతి విలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న కార్చిచ్చు ప్రకృతి విలయానికి సంబంధించిన వీడియో అని అర్థమైంది. దాదాపు 1.45కోట్ల ఎకరాల అటవీ ప్రాంతం బూడిదైపోయింది. ఈ మంటల్లో చిక్కుకొని 50కోట్లకు పైగా మూగజీవాలు చనిపోయాయి. ఊహించని పరిణామానికి ప్రపంచం షాక్ లో ఉండిపోయింది. వాతావరణ ప్రకోపం ఇది అంటూ ప్రచారమవుతోంది. 

 

దీనిపై చలించిపోయిన అనసూయ దేవుడా మమ్మల్ని కాపాడు! అంటూ ప్రాధేయపడింది. ఇక ఈ మంటల్లో కోట్ల సంఖ్యలో పక్షులు.. జంతువులు మంటల్లో కాలి బూడిదైపోవడం ఒకవైపు పర్యావరణ- మరో వైపు జంతు ప్రేమికుల్ని కలచివేస్తోంది. ఇంతకుముందు ఇదే తరహాలో న్యూ సౌత్వేల్స్.. క్వీన్స్లాండ్ లో కార్చిచ్చు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇలా ప్రతియేటా అడవులు తగలబడిపోతుంటే ఓజోన్ పొరకు చిల్లు పడి భూమిపై ఆక్సిజన్ కోల్పోతున్నామన్న భయాందోళనలు కలుగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: