సూపర్ స్టార్ మహేశ్ బాబు-రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమ సరిలేరు నీకెవ్వరు. 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ప్రత్యేకమైన పాత్ర ద్వారా సరిలేరు తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహర్షి వంటి మంచి కమర్షియల్ హిట్ తర్వాత మహేష్ అలాగే ఎఫ్ 2 వంటి ఇండస్ట్రీ బిగ్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తుండటంతో మొదటి నుంచే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ నుండి, టీజర్, ట్రైలర్ తో ఇంకా హైప్ పెరిగిపోయింది.

 

ఇక సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరబాద్ ఎల్‌బి స్టేడియంలో అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఉన్న మెగాస్టార్ వంటి  హేమాహేమీల సమక్షంలోలో ఈ సినిమా ఈవెంట్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్‌గా సైరా కూడా ఇదే ఎల్‌బి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సెంటిమెంట్ సరిలేరుకి వర్తిస్తున్న నమ్మకం ధీమా అటు మెగా అభిమానులు ఇటు సూపర్ స్టార్ అభిమానుల్లో సెంటిమెంటల్ గా గట్టిగా ఉంది. ఇక ఎల్‌బి స్టేడియం మొత్తం మెగా అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులతో ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతోంది. 

 

అంతేకాదు గతంలో ఇదే స్టేడియంలో సక్సస్ ఫుల్ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-కియారా అద్వాని నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయి మహేష్ కెరీర్లోనే అత్యధిక రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఇదే ప్లేస్ లో సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న తరుణంలో అదే స్థాయిలో హిట్ అవుతుంది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: