టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో మంచు లక్ష్మి ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. అయితే ఈమధ్య తెలుగులో పెద్దగా అవకాశాలు లేక రకుల్ బాలీవుడ్ వైపు కన్నేసింది. అక్కడ క్రెజీ ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు హైదరాబాద్ నుండి ముంబై షిఫ్ట్ అయ్యింది. తెలుగులో వచ్చే అరకొర అవకాశాల కన్నా హిందిలో సినిమాలు చేసుకోవడం బెటర్ అని భావిస్తుంది. ఇదిలాఉంటే రకుల్ గురించి ఓ టాప్ సీక్రెట్ బయటపెట్టింది మంచు లక్ష్మి.

 

తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన రకుల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రేక్షకులకు తెలియనిది నేను చెప్పాలని అనుకుంటున్నా.. ఇది ఇదివరకు తను చెప్పిందో లేదో నాకు తెలియదు కాని నేను మాత్రం చెప్పాలని అనుకుంటున్నా అని.. రకుల్ ఈమధ్య వెజిటేరియన్ గా మారిందని.. అది నాకు చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు మంచు లక్ష్మి. ఎప్పుడూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే మంచు లక్ష్మి లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా మంచు లక్ష్మి పై విషయాలను వెళ్లడించారు.

 

అంతేకాదు 2019 తన లైఫ్ లో చాలా బాధాకరమైన విషయాలు జరిగాయని.. ఇలాంటివి తన శత్రువులకు కూడా జరుగకూడదని అన్నాది మంచు లక్ష్మి. ఇక త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయిలో సినిమాల మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా చెప్పిన మంచు లక్ష్మి. యూట్యూబ్ ఛానెల్ పెట్టే ఆలోచలో ఉన్నట్టు తెలుస్తుంది. తనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన తన తండ్రి మోహన్ బాబు తన అంటే చాలా ఇష్టమని.. నాకు నచ్చిన నటుడు.. వ్యక్తి ఎప్పటికి ఆయనే అని తండ్రి మీద ప్రేమాభిమానం చూపించారు మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: