సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన సత్తాని  చాటింది. మిగతా భాషల్లో ఈ సినిమా ఫర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. సైరా లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత చిరంజీవి కొరటాల శివ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడితో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

అయితే ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని సమాచారం. సినిమా పేరు ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కొరటాల శివకి వార్నింగ్ ఇచ్చాడు. చిరంజీవి మాట్లాడుతూ, హీరో మహేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి పై ప్రసంశలు కురిపించారు. ఐతే అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అతి తక్కువ టైమ్ లో పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగించింది అన్నారు. 

 

సాధారణంగా మహేష్ మూవీ అంటే నెలల తరబడి టైమ్ పడుతుందని అలాంటిది అనిల్ రావిపూడి కేవలం 80-90పనిదినాలలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి సత్తా చాటారు అన్నారు. ఒక స్టార్ హీరో సినిమా అంత తక్కువ టైమ్ లో పూర్తి చేయడం వల్ల సినిమాకి చాలా ప్లస్ అవుతుందని, అలాగే పెద్ద సినిమాలని ప్రేక్షకులని తొందరగా చేరువ చేసిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. ఇంకా, ఇలాంటి పరిణామాల వలన నిర్మాతకు చాలా ఖర్చు ఆదా అవుతుందన్న ఆయన తక్కువ సమయంలో మంచి అవుట్ ఫుట్ తో సినిమాలు తెరకెక్కించడం చాలా మంచి పరిణామం అని అన్నారు. 

 

అదే సమయంలో వేదికపైనే తన 152వ చిత్ర దర్శకుడు కొరటాల శివను పిలిచి...‘పబ్లిక్ ముందు కమిట్ అవుతున్నాను నువ్వు కూడా వంద రోజులలోపే సినిమా పూర్తి చేయాలి.. 99వ రోజు వరకు కూడా వెళ్ళకూడదు ‘ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానిని కొరటాల శివ నవ్వుతూ అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: