ప్రిన్స్ మహేష్ బాబు రష్మిక మందాన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి నటించడం మళ్లీ నిన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో కార్యక్రమం బాగా హిట్ అయిందని చెప్పవచ్చు. ఈ ఈవెంట్ షో కు వ్యాఖ్యాతగా సీనియర్ యాంకర్ సుమ కనకాల బాధ్యతలను నిర్వహించింది. చిరంజీవి కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అలాగే, ప్రిన్స్ మహేష్ బాబు పక్కన కూర్చున్నారు. దాంతో అందరికీ కనులవిందుగా ఈ చి ఈవెంట్ కనిపించింది.


ఇకపోతే చిత్రంలోని ప్రతి ఒక్కరు సరిలేరు నీకెవ్వరు టీమ్ గురించి, సినిమా గురించి స్టేజి మీదకి వచ్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందాన కూడా స్టేజి మీదికి వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ కనకాల ని గట్టిగా కౌగలించుకుంది. ఆ తర్వాత.. అబ్బబ్బబ్బా ఇలాంటి ఆడియన్స్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ చూడలేమేమో అంటూ తన స్పీచ్ ని చాలా ఉత్సాహంగా ప్రారంభించింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మీరు నాకు లక్కీ చామ్ సర్, మీరు నా చలో సినిమా ఫంక్షన్ కు వచ్చారు, గీతా గోవిందం సినిమా ఫంక్షన్ కు వచ్చారు, మళ్లీ ఇప్పుడు వచ్చారు.. మీరు ఏ సినిమా ఈవెంట్ కి వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఇది కూడా హిట్ అవుతుందని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని ఆమె పొడి పొడి మాటలతో చెప్పేసింది. ఆ తర్వాత సుమా జోక్యం చేసుకొని... 'నేను కూడా నీకు లక్కీ చామ్ నే. నీ  ఇంతకుముందు సినిమాలు కూడా నేనే వచ్చాను అవి హిట్ అయ్యాయి' అని చెప్పుకొచ్చింది. 'అయ్యో!చిరు సార్,చూశారా?' అంటూ నవ్వుతూ రష్మిక అంటుంది. అప్పుడు సుమ తల దించుకుని ఎవరు డబ్బా వాళ్లు కొట్టుకోవాలని.. మీరు మాట్లాడండి అంటుంది. రష్మిక మందాన మాట్లాడుతూ ' ఏదేమైనా, అనిల్ సార్ కంగ్రాచ్యులేషన్స్' అని తన మిగతా స్పీచ్ ని కొనసాగించింది.


అయితే ప్రస్తుతం సుమ కనకాల చేసిన వ్యాఖ్యలు.. 'ఎవరి డబ్బా వాళ్ళకు కొట్టుకోవాలి' ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈవెంట్ షో ని ఎంతో పాజిటివ్ గా ముందుకు నడిపించే సుమా ఈ విధంగా ఎవరి పరువు తీసేసిందని కొంతమంది గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమె అలా అనడానికి గల కారణం ఏంటి.. ఏ ఉద్దేశంతో అన్నదని దానిపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: