టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే కొంత మంది మాత్రమే విజయాలు సాధిస్తూ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇప్పుడు రాణిస్తున్నారు.  నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించారు.  ఇక స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.  అయితే నందమూరి కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు తీస్తున్నారు.  తాజాగా కళ్యాన్ రామ్ నటిస్తున్న 'ఎంతమంచి వాడవురా'  మూవీ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

 

'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించిన దర్శకుడిగా సతీశ్ వేగేశ్న ‘ఎంత మంచి వాడవురా’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో  కల్యాణ్ రామ్ - మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన రాకని ఖరారు చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. గతంలో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి కళ్యాన్ రామ్ రావడం చూశాం.. అన్నయ్య మూవీ పంక్షన్ కి తమ్ముడు ఎన్టీఆర్ రావడం చూశాం.

 

ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తే.. మంచి ఫాలోయింగ్ ఉంటుందని తెలిసిందే.. అంతే కాదు ఆ మూవీ కూడా హిట్ టాక్ వస్తుందని అంటారు.  మరి ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.. మరి తమ్ముడు సెంటిమెంట్ అన్నయ్యకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: