సూపర్స్టార్ మహేష్బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం సూపర్స్టార్, మెగాస్టార్ ఒకే స్టేజ్ పైన కనిపించడం ఫ్యాన్స్ కి పట్టలేనంత ఆనందాన్నిచ్చింది. ఇదిలా ఉంటే వీటన్నటికంటే నిన్నటి వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో లేడీ అమితాబ్ విజయశాంతి వీళ్ళద్దరి సందడి అయితే వేదిక మీద మాములుగా లేదు. ఫ్యాన్స్ అందరికీ వీరిముగ్గురుని చూస్తుంటే ఎంతో కన్నుల పండుగలా అనిపించింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మునుపెన్నడూ లేని విధమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంత అభిమానులు ఊహించిన దానికంటే కూడా మించి ఉండడం అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” బ్లాక్ బస్టర్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని ట్రైలర్ తో చెప్పకనే చెప్పేసారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదట్లోనే హైలైట్ అయ్యారు, ప్రముఖ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. నటులు బండ్ల గణేష్. అయితే ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత అందులోనూ బ్లేడ్ తో సంచలనం రేపిన ఘటనను తీసుకుని దర్శకుడు అనీల్రావిపూడి అదే బ్లేడ్ తో కామెడీ అదిరిపోయే స్థాయిలో కామెడీని పండించారు. దీంతో బండ్లగణేష్ హైలైట్ అయ్యారు. అయితే ఈయన అలా స్పెషల్ ఫోకస్ అవ్వడానికి కారణం దర్శకుడు అనీల్ రావిపూడే అని స్పష్టంగా తెలుస్తుంది.
గత కొంత కాలం క్రితం బ్లేడ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు దీనితో ఈ పాయింట్ నే పట్టుకొని ఈ చిత్రంలో అదిరిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. ట్రైలర్ లోని బ్లేడ్ నోట్లో పెట్టుకొని ఉన్న సీన్ చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. సో ఈ పాత్రను బండ్ల గణేష్ కూడా గుర్తుండిపోయేలాగే చేశారనిపిస్తుంది.అందువల్లే కాబోలు ఈ సినిమా చూసాక బ్లేడ్ గణేష్ అని ఎవరూ పిలవొద్దు బండ్ల గణేష్ అనే పిలవమన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే వచ్చే జనవరి 11 వరకు ఆగాల్సిందే. ఇక బండ్ల గణేష్ నిన్న ఈవెంట్లో కాస్త ఫీలయినట్లు అనిపించింది. యాంకర్ సుమ మాట్లాడితే స్టేజ్ మీదకి బ్లేడ్ గణేష్ బ్లేడ్ గణేష్ అని పిలవడంతో ఆయన కాస్త ఫీలవయినట్లు అనిపించింది.