ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా సోమవారం చేసిన ఓ ట్వీట్ అదిరిపోయింది. ట్వింకిల్ ట్వీట్ అందరు ఆశ్చర్యపోయారు. అసలు ఈ ట్వీట్ ఎలా చేశారు అన్న క్యూరియాసిటి నెటిజన్స్ లో కలిగింది. సామాజిక, రాజకీయ పరిస్థితులపై ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఢిల్లీ జేఎన్యూలో ఆదివారం రాత్రి కొందరు ముష్కరులు ముసుగులు వేసుకుని కర్రలు, ఇనుప కడ్డీలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషి ఘోష్ సహా 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
జేఎన్యూలో చోటు చేసుకున్న ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ తనవంతు సామాజిక బాధ్యతగా ట్విటర్ వేదికగా.... ‘భారత్... ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ దొరుకుతుంది. అయితే భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదు. మీరు హింస ద్వారా జనాలను అణచివేయలేరు. అలా చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది. నిరసన ప్రదర్శనలు పెరుగుతాయి. రోడ్డుపైకి జనాలు వస్తారు’ అని మోడీ సర్కార్పై ట్వింకిల్ ఖన్నా ఘాటుగా ఘాటుగా స్పందించారు.
ఇక ట్వింకిల్ ఖన్నా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరోయినే. హీరో విక్టరీ వెంకటేష్ సరసన ట్వింకిల్ ‘శీను’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుంది. బాలీవుడ్ లో బర్సాత్, బాద్షా, మేళా వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిన తర్వాత హీరో అక్షయ్కుమార్ను పెళ్లి చేసుకున్నారు. మోడీ-అమిత్షాల పేరు చెబితే గజగజ వణికిపోతున్న వ్యవస్థలో....వారిపై ఘాటైన విమర్శలు చేసిన ట్వింకిల్ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ కామెంట్స్ కి నెటిజన్స్ ట్వింకిల్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ట్వీట్స్ తోను ట్వింకిల్ ని పొగిడేస్తున్నారు. ఇక గత ఏళ్ళుగా ట్వింకిల్ తన భర్త అక్షయ్ కుమార్ తో ఉంటూ నిర్మాణ బాధ్యలని చూసుకుంటున్నారు.