బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు హిట్ తర్వాత మంచి జోష్ మీద ఉన్నాడు. అంతకుముందు ఎన్నో ఫ్లాపులు వచ్చినా ఈ హిట్ అతనికి కొంత ఊరటని ఇచ్చింది. అయితే ఆ జోష్ లోనే సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంతొష్ శ్రీనివాస్ గతంలో కందిరీగ, హైపర్, రభస లాంటి చిత్రాలకి దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త చిత్రం రాబొతుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక్కడే సినిమాకి ఒక అవాంతరం ఏర్పడింది. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కీ, ఆ చిత్రానికి కెమెరామెన్ గా చేస్తున డుడ్లీకి పొసగట్లేదట. వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడిందట. డైరెక్టర్ చెప్పే షాట్స్ తో డూడ్లీ ఏకీభవించక పోవడంతో దర్శకుడికి చిర్రెత్తుకొచ్చిందట. దానివల్ల షూటింగ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం.అ అయితే డూడ్లీ ఏమీ చిన్న కెమెరామెన్ కాదు.
అతడు బాలీవుడ్ లో చెన్నై ఎక్స్ ప్రెస్, సింగం లాంటి చిత్రాలకి పనిచేశాడు. అలాంటి వాడు షాట్స్ విషయంలో తేడా చేస్తాడా అన్న అనుమానం కలుగుతుంది. అయితే ఇక్కడే ఓ విషయం అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ ఎంత గొప్పవాడైన దర్శకుడిని ఇమేజినేషన్ ని అర్థం చేసుకోలేకపోతే అతడి గొప్పదనం ఏమాత్రం పనిచేయదు. ఇక్కడ కూడా అదే జరిగిందట. అందువల్ల డూడ్లీ ఆ సినిమా నుండి తప్పుకున్నాడట.
ఇక ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్లో కనపడబోతున్నారు. కాగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.