విక్టరీ వెంకటేశ్ వెంకీ మమా సక్సెస్ తో మంచి హుషారుగా ఉన్నాడు. రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకీ కామెడీ టైమింగ్ అదరహో అనే చెప్పాలి. సినిమా ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉన్నాడు వెంకీ. ఇప్పటి వరకు వెంకటేష్ గా ఉన్న వెంకీ.. ఇప్పుడు అందరికీ వెంకీ మామా అయిపోయాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంకతేష్ తమిల చిత్రం అయిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

 

 

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ తమిళంలో మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో ధనుష్ నటనకి మంచి పేరొచ్చింది. అటు ప్రేక్షకులతో పాటు విమర్శకులని సైతం ఈ చిత్రం మెప్పించింది. అయితే ఈ చిత్రాన్ని సురేష్ బాబు భారీ సొమ్ము పెట్టి రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నట్టు సమాచారం. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

 

 

 

అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెల 20న మొదలుకానుంది.  సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉండేది కావడంతో సీమ జిల్లా అనంతపురంలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే లొకేషన్స్ ఫైనలైజ్ చేశారట టీమ్. అంతేకాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయనున్నారట.

 

 

 

 

ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించనుంది. మొదటగా శ్రియ కనిపిస్తుందని చెప్పినప్పటికీ ఆఫరుకి ప్రియమణిని ఫైనల్ చేశారు. ఇంకా మిగతా నటీనటులంతా కొత్త వాళ్ళుండే అవకాశమే ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: