సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజాగా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. న‌టించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  మరోవైపు ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 

 

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో కూడా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఆదివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో సరిలేరు నీకెవ్వరు ట్రైల‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రేమికులు ఈ మూవీ కథాంశంపై కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ బాబుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మేజర్ చంద్రకాంత్ తో పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర వలే విజయశాంతి పాత్రను రూపొందించారని తెలుస్తోంది. 

 

ఇక మహేష్ బాబు సినిమా అతడులోని కొన్ని యాంగిల్స్ కూడా సరిలేరులో కనిపించాయని అంటున్నారు. మ‌రి అదే నిజ‌మైతే ఎన్టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ త‌ర‌హాలో వ‌చ్చిన ఈ సినిమా మ‌హేష్‌ను గ‌ట్టెక్కిస్తుందా.. లేదా.. అన్న జ‌న‌వ‌రి 11న తేలిపోనుంది. కాగా, ఈ సినిమాలో మ‌హేస్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. బిజినెస్ మెన్ తర్వాత మహేష్ కెరీర్‌లో అంత వేగంగా పూర్తైన సినిమా ఇదే. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉంటుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: