ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న బిగ్ బాస్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు 12 సీజన్లు పూర్తి చేసుకొని పదమూడవ సీజన్ రన్ అవుతుంది.  ఇక బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ కి ఇప్పటి వరకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు బాలీవుడ్ బిగ్ బాస్ లో ఎన్నో కాంట్రవర్సీలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు బిగ్ బాస్ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్న కొంత మంది నటులు వెండితెరపై తమ జోరు కొనసాగించారు.  మొదట్లో బిగ్ బాస్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా సాగించినప్పటికీ ఈ మద్య కాలంలో కాస్త అశ్లీలత పెరిగిపోయిందని కామెంట్స్ వినిపించాయి.  ఆ మద్య హూస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఎవరికీ చెప్పకుండా ఇంటి సభ్యులు దగ్గరికి రానివ్వకుండా కిచెన్, బాత్ రూమ్ అన్నీ తానే స్వయంగా క్లీన్ చేసి వారి తప్పలు ఎత్తి చూపారు.

 

తాజాగా బిగ్ బాస్ 13 లో మరో రచ్చ సోషల్ మీడియా కుదిపి వేస్తుంది. ఈ సారి ఏకంగా ఓ పార్టిసిపెంట్‌ తోటి కంటెస్టెంట్‌ను చెప్పు తీసుకుని కొట్టడం వివాదాస్పదమయింది. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విశాల్‌ ఆదిత్య, మధురిమా తులి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఉన్న వీరిద్దరు తగవులాడుకున్నారు. మొదట విశాల్ అక్కడ ఉన్న మదురిమను తన నోటికి వచ్చినట్లు తిట్లదండకం అందుకున్నాడు... తన కంటి ముందు నుంచి వెళ్లిపొమన్నాడు. దాంతో కోపంతో ఊగిపోయిన మధురిమ తన స్లిప్పర్ తీసుకొని విశాల్‌కు చెప్పుదెబ్బ రుచి చూపించింది.   

 

చెప్పుతో కొట్టి అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్‌ ఇద్దరినీ కన్ఫెషన్‌ రూంకు పిలిచాడు. తొలుత విశాల్‌ మాట్లాడుతూ శారీరక హింసకు పాల్పడేవాళ్లను ఇంట్లో ఇనుమతిస్తారా? అని ప్రశ్నించాడు. దాంతో తాను చెప్పుతో కొట్టడం తప్పే అని విశాల్ కి క్షమాపణ చెప్పింది మధురిమ. శారీరక హింసకు పాల్పడినందుకుగానూ మధురిమను రెండు వారాల పాటు నేరుగా నామినేట్‌ చేస్తున్నట్లు బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: