కత్రీనా కైఫ్ టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లీశ్వరి సినిమాతో 2004 పరిచయమైంది. ఆ తర్వాత బాలయ్య సరసన అల్లరిపిడుగు సినిమాలోను నటించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అంతే ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ స్టార్ హీరోయిన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. కత్రినా 2005వ సంవత్సరంలో మైనే ప్యాన్ కున్ కియా అనే సినిమాతో సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ గా బాలీవుడ్ లో పరిచయం అయ్యింది.

 

సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత వెనక్కు చూసుకోకుండా కత్రీనా కైఫ్ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లో దాదాపు టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ పొడుగు కాళ్ళ సుందరి గత సంవత్సరం సల్మాన్ నటించిన భారత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా స్టార్ హీరోలకు జోడీగా హాట్ అండ్ ఐటెం క్యారెక్టర్స్ ని చేస్తూనే ఉంది.

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలంకు పైగా కెరీర్ సాగించిన కత్రినా తన 15 ఏళ్ల సినీ కెరీర్ పై చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా వెల్లడించింది. ఒక టాక్ షో లో కత్రీనా కైఫ్ మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటించడం నాకు మంచి అనుభవంను మిగిల్చింది. చెప్పలేనంత సంతృప్తిని పొందాను. సినిమాల వల్ల ఎన్నో ప్లేస్ లకు వెళ్లాను అప్పుడు నేను పొందిన ప్రశాంతత ఎప్పటికి మర్చిపోలేను అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరచింది.

 

అంతేకాదు నాకు దక్కిన ప్రతి పాత్రను ప్రేమించి చేయడానికే నేను ప్రయత్నించాను. పాత్ర చిన్నది అయినా పెద్దది అయినా నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాను అంటూ తను ఇప్పటివరకు చేసిన పాత్రల గురించి చెప్పింది. స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పటికి ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా బ్యూటి ఎప్పుడు వెనుకాడలేదు. ఇక ప్రస్తుతం కత్రినా గ్లామర్ అండ్ స్పీడ్ చూస్తుంటే ఇంకో అయిదు సంవత్సరాల వరకు ఇదే ఊపు ఉండేలా కనిపిస్తుంది. ఇక కత్రినా మొదట్లో డాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడమే కాదు ఇండస్ట్రీలో చాలామంది తనకి డాన్స్ రాదని కామెంట్ కూడా చేశారు. కానీ రాను రాను కత్రినా డాన్స్ చూసిన ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారు. అంతలా డాన్స్ లో ఇంప్రూవ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: