సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా సెన్షేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దర్బార్' ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది. గత రెండి రోజులుగా కౌంట్ డౌన్ లెక్కపెట్టిన తలైవా ఫ్యాన్స్ ఎట్టకేలకు థియోటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఈ సినిమా బెఫిట్ షో పడ్డ దగ్గరుంచే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. దాంతో ఇక రజనీ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లను పూల దండలతో ముస్తాబు చేసి థియోటర్స్ ముందు జన సందోహం తో నిండిపోయారు. ఇక రజనీ ఫ్యాన్స్ థియేటర్ ముందు సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి అభిషేకాలు చేస్తున్నారు. దాదాపు 9 ఏళ తర్వాత వచ్చిన భారీ హిట్ కావడంతో రజనీ ఫ్యాన్స్ కి ఉత్సాహం ఉరకలు వేస్తోంది.  

 

ఇక ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా దర్బార్ హంగామా మొదలైపోయింది. ఇప్పట్లో ఈ హంగామాకి బ్రేక్ వేయడం చాలా కష్టం. అంతేకాదు చెన్నై సిటీలోని కొన్ని ప్రయివేటు సంస్థలు సెలవులను ప్రకటించడంతో ఏ ఒక్కరూ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో లేనేలేరు. తమిళనాడు మొత్తం ఎక్కడ చూసిన రజనీ దర్బార్ పోస్టర్ ఎవరి నోట విన్నా దర్బార్ మాటే వినిపిస్తోంది. రజనీ గత సినిమాలు డిజాస్టర్ కావడంతో  అటు సినీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో..రజనీ ఫ్యాన్స్ లో చిన్న సందేహం ఉండింది. కానీ రజనీ తన స్టామినా ఏంటో చూపించి యావత్ ప్రేక్షానికానికి గట్టి షాక్ ఇచ్చాడు. సూపర్ స్టారా మజాకా అని కాలర్ ఎగరవేసేలా ఈలలు వేసేలా మ్యాజిక్ చేశారు.

 

ఇక టాలీవుడ్ లో రజనీ దర్బార్ గురించి ఎవరు అంత ఆసక్తిగా మాట్లాడుకోలేదు. ఆయన గత సినిమాలు కబాలి, కాలా, పేట ఇక్కడ భారీ డిజాస్ట్రస్ కావడంతో ఇప్పుడు దర్బార్ కూడా అదే లిస్ట్ లో చేరిపోతుందనుకున్నారు. కానీ ఇప్పుడు టాక్ చూస్తే అంతా రివర్స్ అయిపోయింది. తలైవా మజాకా అన్న మాట వినిపిస్తుంది. అసలు ఏమాత్రం హడావుడి, హంగామా లేకుండా రిలీజ్ కి ముందు భారీ ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా వచ్చిన రజనీ మన టాలీవుడ్ స్టార్ హీరోలకు షాకిచారు. ఇప్పుడు బన్నీ, మహేష్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని డైలమాలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: