జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నటనకానీ,  డాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ విషయంలో గానీ ఆయన రూటే సపరేటు. నందమూరి వంశంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. కొన్నేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr అనే సినిమాలో నటిస్తున్నాడు.

 

ఇదిలాఉండగా.. ఫ్యాన్స్ అంటే ఎంతగానో గౌరవించే తారక్.. వాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అభిమాన హీరో వస్తున్నాడంటే ఫ్యాన్స్ ఈ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడకి వాలిపోతారు.. హీరో మాట్లాడితే అభిమానులు వేసే కేకలు, అరుపులుకి స్టేజ్ దద్దరిల్లాలిసిందే.. ఆయితే అభిమానులు వేసే ఈ కేకలు వల్ల ఎన్టీఆర్ కి కోపం వచ్చింది. అసలు విషయం లోకి వెళితే..... నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. ఓ వైపు భారీ సినిమాలు విడుదల అవుతుండగా.. కల్యాణ్ రామ్ వాళ్లకు పోటీగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దిగుతున్నాడు.

 

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ వేడుక ఆసాంతం అరుపులు, కేకలతో సందడి చేసిన ఫ్యాన్స్.. చివర్లో మాత్రం చిరాకు తెప్పించారు. ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతానని గతంలో చెప్పిన కల్యాణ్ రామ్.. ఫ్యాన్స్ చేస్తున్న గోలకు ఎంతో సేపు మాట్లాడలేదు...

 

తర్వాత ఫంక్షన్ చివర్లో మాట్లాడేటపుడు ఫ్యాన్స్ వేసిన కేకలకు కళ్యాణ్ రామ్ సరిగా మాట్లాడలేదు. కల్యాణ్ రామ్‌ను మాట్లాడనివ్వని ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడు. ‘మీరు సైలెంట్‌గా ఉంటారా.? నన్ను వెళ్లిపోమంటారా?' అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో వాళ్లు కాసేపు నెమ్మదించారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ వాళ్లంతా గోల చేయడంతో తారక్ కాసేపు మాత్రమే మాట్లాడారు..

 

చివర్లో ఎప్పుడూ చెప్పే విధంగా ప్రసంగించాడు. ‘మీరు ఇక్కడి నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లండి. మీకు మాకంటే ముందు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్లంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందరూ తమ తమ ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లండి' అంటూ ఫ్యాన్స్ క్షేమం కోరుకున్నాడు తారక్.ఎంత కోపంలో ఉన్న ఫ్యాన్స్ విషయంలో జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: