సూపర్ స్టార్ మహేష్ బాబు రష్మిక మందన్న జంటగా సరిలేరు నీకెవ్వరు సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అనీల్ రావి పూడి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అసలు సినిమాలే వద్దనుకున్న విజయశాంతితో సరిలేరుకి ఒప్పించాడు అనీల్. సంక్రాంతి సందర్భంగా 11 న సరిలేరు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మహేష్ బాబు అభిమానుల్ని ఆకట్టుకునే అంశాలు సరిలేరు లో చాలా ఉన్నాయట. ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని తెగ చెప్పుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు రావిపూడి ఈసారి సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్ళీ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడని అంటున్నారు. 

 

ఇక తాజా గా 'సరిలేరు నీకెవ్వరు' కి సంబంధించి మహేష్ కూడా మీడియా ముందుకొచ్చి సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ బయటపెట్టాడు. 'మహర్షి' తర్వాత కమిట్ అయిన ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మరీ అనిల్ ను లైన్ లో పెట్టాడట సూపర్ స్టార్. నిజానికి ఈ కథను 'ఎఫ్2' టైంలోనే మహేష్ కి చెప్పాడట అనిల్. నలబై నిమిషాల పాటు నరేషన్ ఇచ్చాడట. అయితే అప్పటికే ఇద్దరూ వేరొక సినిమా కమిట్ అయ్యారట. అవి పూర్తయ్యాక చేద్దామని మహేష్ అనిల్ కి చెప్పి పంపించాడట. తర్వాత 'F2' బ్లాక్ బస్టర్ అవ్వగానే అనిల్ కి ఫోన్ చేసి మొన్న మీరు చెప్పిన సినిమా ఇప్పుడే చేసేద్దామా కుదురుతుందా ? అని సినిమాటిక్ గా అడిగాడట. దాంతో అనిల్ వెంటనే సంబర పడుతూ ఒకే అనేసాడట. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకున్నాడు మహేష్.

 

ఇక తను ఆ టైంలో తీసుకున్న డిసిషన్ తన కెరీర్ లోనే బెస్ట్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆ మాటల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. అంతే కాదు సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారు అంటూ చెప్పాడు. అంత బాగానే ఉంది. కానీ మహేష్ కొత్తగా సరిలేరులో చేసిందేం లేదని ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. గతంలో 'పోకిరి''దూకుడు''ఖలేజా' లో చేసిందే మళ్ళీ చేసినట్టు సరిలేరు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక మహేష్ చెప్పినవాటిలో నిజం ఎంతో తెలియలన్నా ఆయన డిసిషన్ బెస్ట్ అని అనిపించాలన్నా ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: