బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో దేవసేన పాత్రలో మెరిసిన అనుష్క కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎనలేని ఖ్యాతి సంపాదించింది. అయితే ఈ సినిమా అనంతరం ఆమె మరో హీరోతో సినిమా చేయలేదు. లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. రెండేళ్ల క్రితం వచ్చిన భాగమతి సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

 

సినిమా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించింది. అరుంధతి లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తర్వాత అనుష్కకి మళ్ళీ అలాంటి విజయం దక్కింది.  అయితే అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తుంది.  ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింటింగ్ కళాకారిణి నటిస్తున్నారు. 

 

ఇక హీరో మాధవన్ మ్యూజీషియన్ గా నటించడం విశేషం. కొద్దిరోజుల క్రితం నిశ్శబ్దం టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జనవరి 31 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడిందేమోననే వార్తలు వస్తున్నాయి.

 

ఈ మేరకు ఇదే విషయాన్ని కోనవెంకట్ ని ప్రశ్నించగా, చిత్ర ప్రమోషన్స్ కొరకు మా దగ్గర మంచి ప్రణాళిక ఉందన్న ఆయన…నిశ్శబ్దం చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సంక్రాంతి పండుగ తరువాతే అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఐతే మూవీ విడుదల ప్రకటించిన విధంగా జనవరి 31న ఉంటుందా లేదా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.  హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ అంజలితో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే కూడా కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: