సూపర్స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే చాలు చాలా మందిలో తెలియని ఒకవైబ్రేషన్ ఉంటుంది. అందులోనూ ఆడపిల్లలకు కలల రాకుమారుడు మహేష్. మహేష్ బాబు సోషల్ మీడియాకి చాలా అంటే చాలా దూరంగా ఉంటారు. అలాంటిది గతంలో ఆయన ఒకసారి వాళ్ళ అమ్మగారి గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ను పెట్టారు. ఈ రోజు అమ్మ శీర్షికలో దాని గురించి తెలుసుకుందాం...
ఇకసారి మహేష్బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ ని పోస్ట్ చేశారు. దాంతో అభిమానులు ఆనందంలో మునిగితేలారు. దేశంలో అన్నిటికంటే గొప్పది అమ్మ, అమ్మకి మించిన దైవం ఉన్నదా అని అంటారు, అది నిజమే అమ్మకి మించిన దైవం లేదు. అమ్మ అనే పిలుపులోనే ఉంది అ కమ్మదనం ఆ పిలుపు అమృతంలా ఉంటుంది. అంతెందుకు సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది అమ్మ సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు అన్ని కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటాయి. ఇప్పటికి ఎందరో డైరెక్టర్స్ అమ్మ సెంటిమెంట్ ని నమ్ముకొన్ని సినిమాలు చేశారు. అందరు కూడా బ్లాక్ బస్టర్ నే సొంతం చేసుకున్నారు. అమ్మ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో సెంటిమెంట్ ఉంటుంది. అది స్టార్ హీరోస్ అయిన సరే అమ్మ అంటే చాలు ఎంతో ప్రేమని చూపిస్తారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంతకుమించి ప్రేమని పండించారు తన అమ్మ పైన.
కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే సినిమా చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్న సమయంలో మహేష్ ఆ తరువాత భారత్ అనే సినిమాతో మరింత బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు. తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` అనే సినిమాతో మరోసారి విజయం సాధించారు. ఇంత బిజీ లో ఉన్న మహేష్ ఏప్రిల్ 20 న తనకి ఎంతో స్పెషల్ డే అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇంతకీ ఏప్రిల్ 20 ఎందుకు అంత స్పెషల్ అనే విషయం లోకి వెళ్తే ఏప్రిల్ 20 న తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజంట. తల్లి ఇందిరా దేవి బర్త్ డే సందర్బంగా ఆమె ఫోటోని షేర్ చేస్తూ, ‘నా జీవితంలో ప్రత్యేకమైన రోజు ఇది. హ్యాపీ బర్త్ డే అమ్మా ‘అంటూ మహేష్ ట్వీట్ చేసాడు. అప్పుడు ఆ ట్వీట్ నేట్టింట్లో చక్కర్లు కొడుతుంది, మహేష్ బాబు కి అమ్మ పైన ఉన్న ప్రేమని చూసి అభిమానులు శభాష్ అంటూ తెగ ఆనందాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన `సరిలేరు నీకెవ్వరు` చిత్రం బిజీలో ఉన్నారు.