టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు.  ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.  అప్పటి వరకు మెగాస్టార్ పై రక రకాల అనుమానాలు ఉన్నా ‘ఖైదీ నెంబర్ 150’తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.  ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది.  తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకర్షించలేకపోయారు.  తాజాగా టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకుంది ఈ సినిమా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీగా ఉంది.

 

ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ కలిసి నిర్మిస్తుంది. దేవాదాయ శాఖలో జ‌రిగిన అవినీతి నేప‌థ్యంలో కథ సాగనున్నట్లు వినికిడి.. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ‌లో ప‌నిచేసే ఓ ఉద్యోగోగా కనిపించనున్నట్లు స‌మాచారం. ఈ సినిమాకి గోవిందా గోవిందా, గోవిందా ఆచార్య అనే టైటిల్స్ ని పరిశీలనలో ఉంచారు. 2020 ఆగస్టు 14న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.   మంచి హిట్లతో దూకుడు మీదా ఉన్న కొరటాల చిరంజీవితో సినిమా తీస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రను అనసూయ పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి.

 

 ముఖ్యమైన ఆ పాత్రకి అనసూయ అయితేనే బాగుంటుందని కొరటాల భావించడం .. ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ మద్య తెగ వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో ఆమె లేదనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమా నుంచి అనసూయ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. చిరూ మూవీలో ఆమె నటిస్తుందని వార్తలు వచ్చినా.. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారో తెలియాల్సిన విషయం. కాకపోతే సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు సహజం.. ఏది ఏమైనా ఈ విషయం చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించే వరకు సస్పెన్సే అంటున్నారు టాలీవుడ్ వర్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: