టాలీవుడ్ లో బద్రి సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య శిష్యుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘బద్రి’.  ఈ మూవీతో దర్శకుడిగా పూరి, హీరోగా పవన్ కి మంచి పేరు వచ్చాయి.  ఆ తర్వాత మాస్ మహరాజ రవితేజతో ‘ఇడియట్’ మూవీతో మరో విజయం అందుకున్నాడు.  ఇక మహేష్ బాబు తో తీసిన ‘పోకిరి’ ఇప్పటికే ఎప్పటికీ సూపర్ హిట్ టాక్ గానే నిలిచింది.  అలాంటి పూరికి ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’ మూవీ తర్వాత వరుసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.  దాంతో మంచి హిట్ తో తన కసి తీర్చుకుందామన్న తపనతో ఉన్న పూరికి అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని జత అయ్యాడు.

 

 వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ మూవీ తర్వాత మరో బంపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండతో ఓ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను కూడా ఆయన సెట్ చేశాడు. ఈ సినిమాకి కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. అందువలన తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారనే వార్తలు వచ్చాయి.  పాన్ ఇండియా మూవీగా వస్తున్ననేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు పూరి.

 

అయితే ఫైటర్ మూవీలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. డేట్స్ ఖాళీగా లేకపోవడం వలన ఆమె నో చెప్పిందనే వార్త రీసెంట్ గా వినిపించింది. దాంతో మరి విజయ్ దేవరకొండ సరసన ఎవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ పూరి మాత్రం పట్టు వదలకుండా జాన్వీ ని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను ముంబైలోనే చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. సినిమా అంటే పిచ్చి ప్యాషన్ ఉన్న పూరి దేనికైనా సిద్దపడే వ్యక్తి అని టాలీవుడ్ టాక్. మరి తన ఫైటర్ మూవీలో జాన్వీని తప్పకుండా చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: