మన టాలీవుడ్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు అంటే.. అమ్మ, అక్క, లేదా అత్త లాంటి ముఖ్యమైన పాత్రలకు పరభాష నటీమణులను ఎంపిక చేసుకోవడానికి మన దర్శకులు ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇలాంటి దశలోనే మలయాళీ భామ నదియా, మన తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రభాస్ అమ్మగా మిర్చి లో నటించిన నదియా, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కథానాయకుడికి అత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 

 

కాగా కాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాల్లో నదియా కీ రోల్‌లో నటించగా.. అజ్ఞాతవాసి ద్వారా ఖుష్బూ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే వీరిలో నదియాకు మాత్రమే మంచి పేరు వచ్చింది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో ఖుష్బూకు పేరు రాలేదు సరి కాదా.. ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. అయితే ఈ క్రమంలోనే త్రివిక్రమ్ మరో సారి తన దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో టబును ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకున్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో ఆమె పాత్రకు చాలా ప్రయారిటీ ఉంటుందనే ప్రచారం కూడా కూడా జరిగింది.

 

 

కానీ ఈ చిత్ర ట్రెలర్ చూస్తే ఇందులో తన పాత్ర ఒక పరిమితిలో సాగుతుందనే విషయ అర్ధం అవుతుంది. అంతే కాకుండా సరిలేరు నీకెవ్వరు లో విజయశాంతి పోషించిన కీలక పాత్ర ముందు.. కీలకం అని చెప్పుకుంటున్న టబు పాత్ర పేలవంగా ఉందని రూమర్స్ ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇంతే కాకుండా  ‘అల వైకుంఠపురములో’. సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం టబు దూరంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

 

ఒక రకంగా అల వైకుంఠపురములో చిత్రం ద్వారా తనకు మంచి రీ ఎంట్రీ ఉండబోతోంది అని ఆశించిన టబుకు నిరాశ మిగిలేలా ఉందనేది బయట వినిపిస్తున్న టాక్ అట. ఇక మరో వైపు సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్ లో రాములమ్మ తన మాటలతో తెగ సందడి చేస్తుంది. మరి ఈ క్రమంలో టబు ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: