టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 'ఫైటర్' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి నటీనటులను ఎంపిక చేసే పనుల్లో బిజీగా ఉన్నారు పూరి అండ్ చార్మీ టీం. పూరితో పాటు ఛార్మి ముంబైలో మకాం వేసి అన్వేషిస్తున్నారు. హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. స్క్రిప్ట్ విని నచ్చడంతో పాటు..రౌడీ స్టార్ తో నటించాలన్న కోరిక తీరుతుందని జాన్వీ అనుకుంది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. పూరికి జాన్వీ షాకిచ్చిందని అంతేకాదు విజయ్ కి ఈ బ్యూటి హ్యాండ్ ఇచ్చిందని అనుకున్నారు.

 

జాన్వీ బిజీ షెడ్యూల్ కారణంగా ఫైటర్ కి డేట్లు కేటాయించలేకపోతోందని.. అందుకనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారమైంది. అంతేకాదు ఈ షాక్ తిన్న పూరి కొత్త హీరోయిన్ ని వెతుక్కునే పనిలో పడ్డారన్న వార్తలు వచ్చాయి. అయితే పూరి జాన్వీనే మైండ్ లో ఫిక్స్ అయినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎంతమంది కొత్త మోడల్స్ ని చూసినా పూరి కన్విన్స్ కాలేకపోతున్నాడుట. పోనీ ఇంతకముందు అనుకున్నట్లు ఇస్మార్ట్ బ్యూటి నిధీ అగ్ర్వాల్ గానీ కియారా గాని ఒకే అనుకుందామానుకున్నా  జానాలు మళ్ళీ నిధిని చూస్తారా అన్న అనుమానం. అలాగే కియారా డేట్స్ దొరుకుతాయా అన్న డైలమా. ఈ నేపథ్యంలో షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసి అక్కడే పూర్తి చేస్తే జాన్వీ దొరుకుందని సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడట ఇస్మార్ట్ పూరి.

 

ఫిబ్రవరిలో జాన్వీ నటించనున్న బాలీవుడ్ తాజా సినిమా తక్త్ షూటింగ్ ప్రారంభం కానుంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ కు కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్త్ కి సమీపంలో ఫైటర్ కి అవసరమయ్యే సరంజామా రెడీ చేసి జాన్వీ ని ఒప్పిస్తే సరిపోతుందని పూరి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడుట. పూరి ఐడియా గనుక వర్కవుట్ అయితే జాన్వీ మిస్సయ్యే అవకాశం లేదు. జనాలు కూడా జాన్వీ మీద ఆసక్తిగా ఉన్నారు కాబట్టి అందులోను విజయ్ సరసన కాబట్టి ఫ్రెష్ లుక్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. అయితే పూరిని ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఇలా డేట్స్ కన్‌ఫర్మ్ చేయకుండా ఇబ్బంది పెట్టలేదు. జాన్వీనే మొదటిది. అందుకే జాన్వీ విషయంలో ఏం డిసైడ్ అవ్వాలో తెలీక నలిగిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: