సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమా కోసం ఇటు మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆ టైమ్ రానె వచ్చేసింది. మహేష్ బాబు సరసన కన్నడ బ్యూటి రష్మిక మందాన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనవరి 11న(నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు.
ఇక లేడి అబితాబ్ విజయశాంతి ఈ చిత్రం ద్వారా సినిమాల్లోకి పునరాగమనం చేశారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ‘f2’ సినిమాతో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న దర్శకుడని నిరూపించుకున్నారు అనిల్ రావిపూడి. తన ఐదేళ్ల కెరీర్లోనే వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన వరుణ్ తేజ్లాంటి కుర్ర హీరోను పెట్టి బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ను తెరకెక్కించారు. అయితే ఎఫ్ 2 సినిమాలో మనోడు వేసిన సెటైర్ ఈ సినిమాకు కరెక్డ్గా వర్తిస్తుంది.
ఆ సినిమా కథ, కథనాలు, కామెడీ సూపర్.. సరిలేరు మాత్రం ఆ సినిమాతో పోలిస్తే బిలో యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయేలా ఉంది. పండగ సీజన్ కావడంతో ఓ మోస్తరు కలెక్సన్లు వచ్చినా మహేష్ రేంజ్లో గుర్తు ఉండిపోయే సినిమా మాత్రం కాదు. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు ఎంట్రీ తరువాత మంచి పవర్ఫుల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా.. మంచి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీన్స్ అనంతరం, హిలేరియస్ కామెడీ తో నిండిపోతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీతోనే సినిమాను నడిపించేశాడు. ట్రైన్ ఎపిసోడ్ కామెడీ బాగానే ఉన్నా అసలు టైం అంతా అక్కడే కిల్ అయిపోయిందని చెప్పాలి.