టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను ఎంతో భారీగా నిర్మించాయి. మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 

 

గతంలో పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలను తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా అదే విధముగా ఒకింత కామెడీ ప్రధానంగా ముందుకు నడిపాడని అంటున్నారు. నిజానికి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు లోటు లేనప్పటికీ, బలమైన కథ కథనాలు అనేవి సినిమాలో లేవని అంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ స్టోరీ అయితే సినిమాలో లేదని, ఇంకొంచెం బలమైన కథను కనుక దర్శకుడు అనిల్ రాసుకుని ఉంటె సినిమా తప్పకుండా మంచి హిట్ అయ్యేదని అంటున్నారు. యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాల వంటివి బాగున్నప్పటికీ, తన కామెడీనే నమ్ముకున్న అనిల్, సినిమాను హిట్ రేంజ్ కు తీసుకెళ్లలేకపోయాడట. సినిమాకు టాక్ జ‌స్ట్ ఓకే అని, అయితే సూప‌రెహే అన్నంత లేదని అంటున్నారు. 

 

అయితే ఫ‌స్టాఫ్ కామెడీ, మ‌హేష్ ఫ్యాన్స్‌కు తోడు సంక్రాంతి సీజ‌న్ సెల‌వులు క‌లిసి రానున్నాయి. అయితే మ‌రోవైపు ద‌ర్బార్‌, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడవురా లాంటి సినిమాలు పోటీగా ఉన్నాయి. ఈ పోటీని త‌ట్టుకుని ఈ టాక్‌తో భారీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖ‌చ్చితంగా సంక్రాంతి సీజ‌నే ఆదుకోవాలని, మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలని అంటున్నారు. కాబట్టి అనిల్ ఇకనైనా పెద్ద హీరోలతో సినిమాలు తీసేటప్పుడు కేవలం కామెడీ మాత్రమే కాక పవర్ఫుల్ స్టోరీ కూడా ఎంచుకుంటే బాగుంటుందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: