సుపర్ స్టార్ మహేస్ బాబు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న ప్రపంచవ్యప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేసాయి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పడగా సినిమాలో కథ రొటీన్ గా ఉన్నా కథనం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు అనీల్ రావిపుడి.
ఆర్మీ మేజర్ గా సూపర్ స్టార్ మహేష్ పవర్ఫుల్ ఎంట్రీ తరువాత వచ్చే యాక్షన్ సీన్, దానితరువాత వచ్చే సాంగ్ తో సినిమా మంచి జోష్ తో సాగుతుంది. అయితే ఫస్టాప్ మొత్తం కామెడీతో నింపేశాడు దర్శకుడు. ఇప్పటివరకు అనీల్ రావిపుడి చేసిన సినిమాలన్ని ఇలానే యాక్షన్ ఉన్నా సరే కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. కథకు ఓ లక్ష్యం, గమ్యం లేవు.. ఓ లేడీ ప్రొఫెసర్ను ఇబ్బంది పెట్టే ఓ మంత్రికి బుద్ధి చెప్పడం.. అది కూడా ఆ ప్రొఫెసర్ కుమారుడు ఆర్మీలో చనిపోతే ఆ ప్లేస్లోకి హీరో ఎంట్రీ ఇవ్వడం. ఈ లైన్ ఏ మాత్రం కొత్తదనం లేదు.. అంత దమ్ము లేదు.
విజయశాంతి రోల్కూడా సరిగ్గా వాడుకోలేదు.. కామెడీ మాత్రం హీరో, హీరోయిన్, విలన్ అందరి చుట్టూ నడిపించి సినిమా మొత్తం కామెడీ సీన్లు మాత్రం బాగా అల్లుకున్నాడు. ఓవర్ ఆల్గా చెప్పాలంటే.. కామెడీ మాత్రం నవ్విస్తుంది.. కథాపరంగా చూస్తే వీకే అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాపై యావరేజ్ టాక్ ఉంది. కామెడీ జనాలకు ఎక్కితే ఎబో యావరేజ్ అవ్వొచ్చు. మరి సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రంతో మహేష్ ఎంత వరకు గట్టెక్కుతాడో చూడాలి. కాగా, అంచనాలు అధికంగా ఉండటం.. సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజులు ఉన్నాయని అనీల్ ఊరించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే దీనికి తగ్గట్టు ప్రయోషన్స్ కూడా బాగా చెయ్యడంతో సినిమాకు కలిసొచ్చేలా కనిపిస్తుంది.