సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని  దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర  నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11 న ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో  లేడి అబితాబ్‌ విజయశాంతి ఈ చిత్రం ద్వారా సినిమాల్లోకి పునరాగమనం చేశారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది. 

 

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ లేడీ ప్రొఫెస‌ర్‌ను ఇబ్బంది పెట్టే ఓ మంత్రికి బుద్ధి చెప్ప‌డం.. అది కూడా ఆ ప్రొఫెస‌ర్ కుమారుడు ఆర్మీలో చ‌నిపోతే ఆ ప్లేస్‌లోకి హీరో ఎంట్రీ ఇవ్వ‌డమే క‌థ‌. అయితే సినిమా స్టార్ట్ అవటమే మిలటరీ ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది. మిలటరీ ఎపిసోడ్ అంటే చాలా బాగా తీసేందుకు స్కోప్ ఉంటుంది. అయితే అనిల్ రావిపూడి మాత్రం చాలా పేలవంగా మిలటరీ ఎపిసోడ్‌ను తెరకెక్కించాడు. నలుగురు పిల్లలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే ఓ పిచ్చి ఫైట్ చేసి వాళ్ళను అక్కడ నుంచి తీసుకువచ్చేస్తాడు. ఆ ఫైట్ ఎంత మాత్రం ఆకట్టుకోలేదు. 

 

మహేష్ ఫస్ట్ సీను తేలిపోయిన‌ట్టు ఉంటుంది. ఇక ఆ వెంటనే తమన్నా ఐటెం సాంగ్ వేసుకుంటాడు. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే మహేష్ ను ఫస్ట్ ఎలివేట్ చేసే సీన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది. రొటీన్ తరహాలో ఒక ఫైట్ ఒక పాట పెట్టాలి అన్నట్టుగా అనిల్ రావిపూడి ఈ సీన్ తీసిన‌ట్టు అనిపిస్తుంది. అలాగే పేరుకు మిలటరీ ఆఫీసర్ అయినా.. మహేష్ అక్కడ చేసిందేమీ ఉండ‌ద‌నే చెప్పాలి. కాగా, దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని చేసింది అయితే లేదు. ఈ సినిమాలో మహేష్ లోని అన్ని యాంగిల్స్ ని టచ్ చేస్తూ అభిమానులకి ఎం కావాలో అన్ని సమకూర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కాని అది కూడా కాస్త ఓవ‌ర్‌గానే అనిపించింది. మ‌రి ఈ సినిమా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: