బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలని పెంచేశాయి. ఈ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కేవలం రెండు పాటలు సినిమాకి ఎక్కడ లేని హైప్ ని తీసుకొచ్చాయి. అటు ట్రైలర్లో త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్ తోనూ అదరగొట్టాడు.

 

 

ఇదిలా ఉంటే బన్నీ గత కొన్ని రోజులుగా మెగా కాంపౌండ్ నుండి బయటకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బన్నీ అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ లో మాట్లాడుతూ.. తానొక్కడే ఇక్కడివరకు వచ్చాడని..అంతా తన కష్టం వల్లే సాధ్యమైందని చెప్పుకున్నాడు. అలాగే తాను టాలీవుడ్లో ఎవరికీ తీసిపోనని.. మిగతా హీరోలతో పోలిస్తే తన జర్నీ కూడా భిన్నమైందని కూడా బన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

 

 

అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ కి అతిధిని పిలవకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాకి మెగాస్టార్ చిరంజీవిని పిచి మెగా సూపర్ ఈవెంట్ నిర్వహించగా..బన్నీ ఏ స్టార్ ని పిలుస్తాడో అని అనుకున్నారు. కానీ బన్నీ అలాంటివేమీ చేయకుండా సోలోగానే ఈవెంట్ కానిచ్చేశారు. అయితే ఇదంతా మెగా కాంపౌండ్ నుండి బయటకి వచ్చే ప్రయత్నమే అని తెలుస్తుంది.

 

 

తనకి ఉన్న అభిమానులే చాలనుకుని.. ఏ హీరోకి తీసిపోని అభిమాన గణం తనకి ఉందని నిరూపించుకోవడానికే బన్నీ ఇలా సోలోగా వెళ్ళి ఉంటాడేమోనని అనుకుంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా బన్నీ ప్లానింగ్ మెగా కాంపౌండ్ నుండి బయటకి రావడమే అని స్పష్టంగా తెలుస్తుంది. అల వైకుంఠపురములో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: