మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఓవర్సీస్లో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు టాక్ను తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్ను ఫర్ ఫెక్ట్గా క్యాష్ చేసుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమాను డిసైడ్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ లేడీ ప్రొఫెసర్ను ఇబ్బంది పెట్టే ఓ మంత్రికి బుద్ధి చెప్పడం.. అది కూడా ఆ ప్రొఫెసర్ కుమారుడు ఆర్మీలో చనిపోతే ఆ ప్లేస్లోకి హీరో ఎంట్రీ ఇవ్వడమే కథ.
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు తో శ్రీనువైట్ల తీసిన దూకుడు సినిమా ఇప్పటికీ సరికొత్త గానే ఉంటుంది. అప్పటి వరకు ఒకే విధమైన విధానం లో సినిమాలు చేసుకుంటూ వచ్చిన మహేష్ బాబు ఆ సినిమాలో శ్రీనువైట్ల చాలా కొత్తగా చూపించాడు. దూకుడు మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు ఆ సినిమాను పదేపదే చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మహేష్ ను అంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త కామెడీ జానర్లో చూపించడంలో శ్రీనువైట్ల బాగా సక్సెస్ అయ్యాడు. మహేష్ బాబు తో ఏ తరహాలో కామెడీ చేస్తే జనాలు చూస్తారో శ్రీనువైట్ల కరెక్ట్ గా పట్టుకున్నాడు.
శ్రీను వైట్ల దగ్గర శిష్యరికం చేసిన అనిల్ రావిపూడి తన గురువు రవితేజతో చేసిన వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎత్తేసి సరిలేరులో వాడుకున్నాడు. వాస్తవానికి వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికీ టీవీలో వస్తుంటే నవ్వు ఆపుకోలేరు. అయితే దీంతో కంపేరిజన్ చేసి సరిలేరు ట్రైన్ ఎపిసోడ్ చూస్తే తేలిపోయినట్టు అనిపిస్తుంది. మహేష్ ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు. అయితే అదంతా పిచ్చిపిచ్చిగా తిక్కతిక్కగా ఉంటుందే తప్ప ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వదు. హీరోయిన్ తో పాటు హీరోయిన్ కుటుంబంపై ఏవేవో సెటైర్లు వేస్తూ ఉంటాడే తప్ప మెయిన్ కథలోకి వెళ్లకుండా లాగించేశాడు అనిల్.