మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో`. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇక బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. 

 

ఇప్పటికే ఈ చిత్ర ఆడియో ఒక రేంజులో హిట్ అయిన సంగతి తెలిదిందే. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఓవర్‌ సీస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల అల వైకుంఠపురములోషోస్‌ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విల‌న్‌కు వార్నింగ్ ఇచ్చే మీటింగ్‌లో ఆ ముగ్గురు హీరోల‌ పాట‌ల‌కు డ్యాన్స్ వేస్తాడు బ‌న్నీ. మహేష్, ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ ల పాటలకు డాన్స్ వేయ‌డంతో.. మూవీ లవర్స్ మరియు ఫ్యాన్స్ కు ఇది ఒక ట్రీట్ అని చెప్పాలి. దీంతో ఆ ముగ్గురు హీరోల అభిమానుల‌ను కూడా ఖుషీ చేశాడు బ‌న్ని. 

 

త‌న సినిమాలో రేసుగుర్రంలోని సినిమాచూపిస్త మావ‌, ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో ఐవ‌నా ఫాలో, మ‌హేష్ వచ్చాడ‌య్యో సామి, మ‌రియు ప‌వ‌న్ గ‌బ్బ‌ర్‌సింగ్ పిల్లా నువ్వులేని జీవితం సాంగ్స్‌కు అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. కాగా, ప్రీమియ‌ర్ షోలు చూసిన స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు బన్నీ ఇరగదీశాడంటుంటే.. కామన్‌ ఆడియన్స్‌ మాత్రం త్రివిక్రమ్‌ టేకింగ్‌లో లోటు పాట్లను ఎత్తిచూపిస్తున్నారు. వాస్త‌వానికి అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడ‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: