టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్నిశ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. ఇక నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ప్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టే సినిమా చేయాలనుకున్నాడో లేక తనకు నచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్తోనే పనిచేయాలనుకున్నాడో ఏమో కానీ సమయం తీసుకుని సినిమాను అనౌన్స్ చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రం అల వైకుంఠపురములో.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12(నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాసిటివ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి కొందరు ముందు నుంచి ఈ సినిమాను టార్గెట్ చేయాలనుకున్నారు. అసలు ఈ సినిమా పోటీలో ఉండదని అన్నారు. కానీ అంచనాలు తల్లకిందులు అయ్యాయి. బొమ్మ అదిరింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. కామెడీ, ఎమోషన్, బన్నీ యాక్షన్ , స్టైల్, కథ, కథనాలు ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్, త్రివిక్రమ్ పెన్ను పవర్, సూపర్ అనిపించాయి.
అలాగే సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అయిన అల్లు అర్జున్ సరికొత్త లుక్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ గా చూపించాడు త్రివిక్రమ్. మరియు అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. మరో విషయం ఏంటంటే అటు కామెడీ టైమింగ్ తోనూ ఇటు ఎమోషనల్ వేవ్లోనూ బన్నీ ప్రేక్షకులను చక్కగా మెప్పించాడు. ఇక ఎవరు ఏమనుకున్నా.. ఈసినిమాపై ఎన్ని ఈకలు పీకినా బొమ్మ మాత్రం సూపర్.. త్రివిక్రమ్, బన్నీకి హిట్ పడిపోయింది. ఈ సంక్రాంతి విన్నర్ బన్నీయే అరి కొందరు అంటున్నారు కూడా.