ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అలా వైకుంఠపురం సినిమా రానే వచ్చేసింది.. విడుదల కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి... సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి 12) భారీ అంచనాల నడుమ విడుదలైంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో 'అల.. వైకుంఠపురములో' డిమాండ్ కనిపిస్తోంది...

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ సూపర్ అంటున్నారు.. మ్యూజిక్ పరంగా కూడా బాగా హిట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా గూర్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ చేసారు.. అలాగే అభిమానులకి ఒక సందేశం కూడా ఇచ్చారు...వివరాలలోకి వెళితే... మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు తెలపడమే గాక తోటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తన రెస్పాన్స్ చెబుతుంటారు.

 

ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో తన కామెంట్ పోస్ట్ చేశారు రామ్ చరణ్. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ 'అల.. వైకుంఠపురములో' థియేట్రికల్ ట్రైలర్ షేర్ చేశారు. ఈ మేరకు అభిమానులకు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు చెర్రీ.ఆల్ ది బెస్ట్ తో మై బ్రదర్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారు, వినోద్ గారు అని చెప్పిన రామ్ చరణ్.. సినిమాను థియేటర్స్‌లో మాత్రమే చూడండని రిక్వెస్ట్ చేశారు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ మెగా అభిమానులను ఖుషీ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరోవైపు 'అల.. వైకుంఠపురములో' సినిమా చూసేందుకు పెద్దఎత్తున జనం థియేటర్స్‌కి విచ్చేస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్ని సెంటర్లలో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: