కొన్నేళ్ల క్రితం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన కొత్తబంగారు లోకం సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అంతకముందు హ్యాపీ డేస్ సినిమాతో నటుడిగా పరిచయం అయిన వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ తో హీరో వరుణ్ తో పాటు హీరోయిన్ గా నటించిన శ్వేతా బసు ప్రసాద్ కూడా మంచి పేరు దక్కించుకుంది. అయితే ఆ తరువాత నుండి వచ్చిన అవకాశాలు మాత్రం విజయాలుగా మలుచుకోవడంలో కొంత తడబడింది శ్వేతా. అనంతరం బాలీవుడ్ లో ప్రవేశించి అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. 

 

అయితే అవేవి కూడా ఆమెకు సరైన సక్సెస్ ని అందించలేదు. ఇక మధ్యలో ఒకటి రెండు సీరియల్స్, వెబ్ సిరీస్ లో కూడా నటించిన శ్వేతా, ఇటీవల రోహిత్ మిట్టల్ అనే యువ దర్శకుడిని ప్రేమించిన అనంతరం, ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. అయితే వివాహం తరువాత ఈ జంట ఏడాది పాటు సజావుగానే కాపురం చేసారు. అయితే హఠాత్తుగా ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని, మొన్న డిసెంబర్ లో వారిద్దరి కుటుంబంలో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ కూడా న్యాయబద్దంగా విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని శ్వేతా కూడా తెలియపరిచారు. 

 

ఇక భర్తతో విడిపోయిన తరువాత నుండి కొన్ని ప్రాంతాల్లో టూర్లు చేస్తున్న శ్వేతా, ఇటీవల గోవాలో సందడి చేసింది. ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతమైన ఈ సముద్ర వార్తవరణంలో ఎంజాయ్ చేయడం మరింత ఆనందాన్నిస్తోందని తెలిపిన శ్వేతా, అక్కడ బికినీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు, పెళ్లి అయినప్పటికి కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదని, మళ్ళి మీరు సినిమాల్లోకి వస్తే బాగుంటుందని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: