టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ రోజు కొంత మిశ్రమ స్పందన లభించింది. సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి చాలావరకు కామెడీ యాంగిల్ లో నడిపాడు. 

 

ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టి నడిపించిన అనిల్, సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ ని కొనసాగించడంలో కొంత తడపడ్డాడు అనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లెంగ్త్ మరింత ఎక్కువ కావడం కూడా సినిమాకు కొంత ఇబ్బందిగా మారింది. అయితే సినిమా మొత్తాన్ని తన అద్భుత నటనతో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు నడిపించారు అనే చెప్పాలి. అలానే ఆయనతో పాటు ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటించిన విజయశాంతి, కెరీర్ పరంగా చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో నటించినప్పటికీ కూడా ఆమె నటనలో మాత్రం కొద్దిగా కూడా పవర్ తగ్గలేదు అనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో సంగీత, రావురమేష్ ఇద్దరూ కూడా రష్మిక తల్లితండ్రులుగా మంచి ఫన్నీ క్యారెక్టర్స్ లో నటించారు. 

 

ఇక తొలిరోజు అత్యధిక థియేటర్స్ లో మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సంపాదించినప్పటికీ, ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం అదరగొట్టే రేంజ్ లో దక్కించుకుంది. ఇక నేడు ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ ని సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, బాహుబలి 2, సాహో, సైరానరసింహారెడ్డి సినిమాల తరువాత అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా గొప్ప రికార్డు నెలకొల్పింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, ప్రస్తుతం పండుగ సెలవలు కావడంతో మరికొద్దిరోజుల పాటు ఈ విధంగానే మంచి కలెక్షన్ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: