ప్రముఖ నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సవాల్ విసిరారు. తనలాగే మహేష్ బాబు కూడా మొక్కలు నాటి చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే సుమ కనకాల, అక్కినేని అమల, రాహుల్ సిప్లిగంజ్, సూపర్ స్టార్ కృష్ణ మొక్కలను నాటి ఇదో గొప్ప కార్యక్రమని కొనియాడారు.

 

రాజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో మనువడితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల మన రాష్ట్రం మన దేశం ఆకుపచ్చగా మారబోతోంది. సందర్భంగా సంతోష్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

 

అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను తాను స్వీకరించిన దిల్ రాజు.. మరో ముగ్గురికి ఆయన ఛాలెంజ్ విసిరారు. ముగ్గురే.. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి.

వీరు ముగ్గురితో దిల్ రాజుకు మంచి అనుబంధం ఉంది. మహేష్ వంశీ పైడిపల్లి  దర్శకత్వంలో నటించిన  మహర్షి కి దిల్ రాజు నే ప్రొడ్యూసర్. అదీ కాకుండా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేసింది దిల్ రాజు. అనిల్ డైరెక్ట్ చేసినసరిలేరు నీకెవ్వరుసినిమాకు ఆయన సమర్పకుడు. మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలని నిర్మించారు దిల్ రాజు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: